telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్రంలో వర్షాలు కురవాలని అమ్మవారికి ప్రార్థన: మంత్రి శ్రీనివాస్ గౌడ్

srinivas goud minister

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఆదివారం తెల్లవారు జామునుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు . ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలని అమ్మవారిని ప్రార్థించినట్లు శ్రీసవాస్ గౌడ్ తెలిపారు.

అమ్మవారి దయవల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చి ఐదేళ్లు దాటిందని అన్నారు. సుమారు 50 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే మేటిగడ్డ ప్రాజెక్టు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రాజెక్టు లు పూర్తయి వచ్చే ఏడాది పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయాలని అమ్మవారికి మొక్కుకున్నట్లు ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.

Related posts