రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాజధానుల విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. అవినీతిపరుల పాలనలో మూడు ప్రాంతాల అభివృద్ధి ఎలా సాధ్యం? అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. స్థానికుల ఆస్తులన్నీ దోచి భూకబ్జాదారులకు కట్టబెట్టడమే వైసీపీ పని అని ఆయన విమర్శించారు. సామాజిక బాధ్యతలేని సీఎంగా చరిత్రలో జగన్ మిగిలిపోతారని ఆయన అన్నారు.
అమరావతి రాజధానికి పూర్తి మద్దతిస్తామని గతంలో జగన్ చెప్పారని అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు రాజధానులపై జగన్ ఎందుకు మాట్లాడలేదు? అని ఆయన నిలదీశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. రాజధాని విషయంలో సోము వీర్రాజు రోజుకోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు.
వెనక్కి తగ్గిన సీపీఐ నారాయణ : చిరంజీవికి క్షమాపణ