telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పప్పు! నీ వాచ్ పనిచేస్తోందో లేదో చూసుకో : లోకేష్ విజయసాయిరెడ్డి సెటైర్

నారా లోకేష్ పై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. ఏపీలో 18 ఏళ్లు దాటిన వారందరికి ఉచిత వ్యాక్సిన్లు ఇస్తామని సిఎం జగన్ గారు ప్రకటించిన తర్వాత లోకేష్ డిమాండు చేయడం ఏంటని ఎద్దేవా చేశారు. “పప్పు! నీ వాచ్ పనిచేస్తోందో లేదో చూసుకో. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారందరికి ఉచిత వ్యాక్సిన్లు ఇస్తామని సిఎం జగన్ గారు ప్రకటించిన తర్వాత నువ్వు డిమాండు చేయడం, ఎవడో రాసిచ్చిన స్క్రిప్టు చదివినట్టుగా ఉంది. అందుకే అచ్చెన్న విసిగిపోయి, భరించలేక అంత మాటన్నాడు. విశాఖలో వ్యాపించిన “వెలగపూడి పచ్చ వైరస్”కు బ్రేకులు. నైట్ ఫుడ్ కోర్టులను ఆక్రమించేశాడు. ఒక్కొక్కరి నుంచి లక్షలు కొల్లగొట్టాడు – వీధి వ్యాపారులను తరిమేశాడు. చిరువ్యాపారాలను మింగేసిన ఆ వెలగపూడి వైరస్ ఇక వ్యాపించే ఛాన్స్ లేదు. మళ్లీ ప్రమాణాలు అంటూ డ్రామాలు మొదలెడతాడేమో ? ” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంతకు ముందు ట్వీట్ లో “హైదరాబాద్ లో కూర్చొని స్టూడియోల్లో గ్రీన్ మ్యాట్ వేసి బ్యాక్ గ్రౌండ్ ఏపీలో ఉన్నట్లు భ్రమింపజేస్తున్న పప్పు లోకేశం – నీలాగే అందరూ శుద్ధ ముద్ద పప్పులనుకున్నావా? నీ స్థాయిని మరిచి డెడ్ లైన్లు పెట్టడం, సవాళ్లు విసరడం మానుకో. నీ అసమర్థతఫై నీ పార్టీ నేతలే జోకులేస్తుంటే నీ ఉడతూపులేంటి?” అంటూ విజయసాయిరెడ్డి చురకలు అంటించారు.

Related posts