telugu navyamedia
తెలంగాణ వార్తలు

కొన్ని బంధాలు ఎప్పటికీ ప్రత్యేకం..

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే పండుగ రాఖీ పండుగ‌. ఈ రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కేటీఆర్ మహిళలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

కొన్ని బంధాలు ఎప్పటికీ ప్రత్యేకం అంటూ.. చిన్న తనంలో తన చెల్లెలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో దిగిన పాత ఫొటోను.. తన పిల్లలు హిమాన్షు, అలేఖ్యలు రాఖీ కట్టుకునే ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

ఇక మరోవైపు ప్రగతి భవన్‌లో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొని తన సోదరుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి ఎమ్మెల్సీ కవిత రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Related posts