telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

కూకట్ పల్లిలో రోడ్డు ప్రమాదం.. తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం

Accident

హైదరాబాద్ కూకట్ పల్లిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానిక వై-జంక్షన్ వద్ద ఓ ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన మరో ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో, ఈ బస్సును తాత్కాలిక డ్రైవర్ నడిపాడు. అతని నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ సంఖ్యలో రోడ్డుపై వెళ్తున వాహనదారులు, స్థానికులు గుమికూడారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని భావించి… అతడిని చితక్కొట్టారు. అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.

Related posts