మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని హోంషంగాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి వేగంతో చెట్టును ఢీకొనడంతో కారు బోల్తాపడటంతో నలుగురు జాతీయ హాకీ క్రీడాకారులు మృతి చెందారు. హోసంగాబాద్లో జరుగుతున్న ధ్యాన్చంద్ ట్రోఫీలో పాల్గొనడానికి ఇటార్సీ నుంచి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో మరో ముగ్గురు ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హోసంగాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతులు షహనవాజ్ఖాన్ ఇండోర్ వాసి, ఆదర్శ్ ఇటార్సీ వాసి, ఆసీస్ లాల్ జబల్పూర్ వాసి, అనికేత్ గ్వాలియర్ వాసిగా గుర్తించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం పై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
ఉత్తమ్ను నమ్ముకుంటే నట్టేట ముంచాడు: జగదీశ్రెడ్డి