ప్రభుత్వ అండతోనే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవాలయాల ఆస్తుల అమ్మకం, అన్యమతస్తుల ప్రమేయం ఎక్కువైందని అన్నారు.
గతంలో మత మార్పిడికి అభ్యంతరం చెబితే వెళ్లిపోయేవారని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక మత మార్పిడులు చేసే వారు రెచ్చిపోతున్నారని అన్నారు.
రాష్ట్రంలో హిందూ మతాన్ని అంతం చేసే కుట్ర జరుగుతోందన్నారు.
చర్చి మీద రాళ్లు వేశారని 41 మందిని సెలెక్ట్ చేసి మరీ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారని చెప్పారు. అదే అంతర్వేది రథం తగలబెడితే ఇప్పటికీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని దుయ్యబట్టారు.
శ్రీశైలంలో అన్యమతస్తుల ప్రమేయంపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువగా వైసీపీ ప్రభుత్వం పోలీసులను వాడుకుంటోందని కన్నా దుయ్యబట్టారు.