హైదరాబాద్లో బోనాల పండగ సందడి నెలకొంది. నగర మంతటా ఎక్కడ చూసినా పండగ శోభే కనిపిస్తోంది. భక్తులతో అమ్మ వారి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎష్ షర్మిల సైతం మొయినాబాద్లో అమ్మవారికి బోనం సమర్పించారు. మొయినాబాద్ మండలంలోని పెద్ద మంగళవారం గ్రామంలోని తన చిన్ననాటి స్నేహితురాలు రజిని నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలిసి బోనాల ఉత్సవాలల్లో పాల్గొన్నారు. బోనాల పండగతో పాటు ఈ రోజు ఫ్రెండ్ షిప్ డే. ఈ నేపథ్యంలో తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లి ఫ్రెండ్షిప్ డేతో పాటు బోనాల వేడుకల్లో షర్మిల పాల్గొన్నారు.
previous post