telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో ఉచిత ఇసుక పాలసీ తేవాలి..చంద్రబాబు డిమాండ్

chandrababu

ఏపీలో ఇసుక కొరత పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ప్రభుత్వం పై మండిపడ్డారు. విజయవాడలో పార్టీ పరిశీలకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు పనిలేక రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటానని పునరుద్ఘాటించారు. వారి కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీ తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్మికులకు మద్దతుగా ఈ నెల 14న దీక్ష చేపట్టనున్నట్లు చంద్రబాబు ప్రకటించిన విషయం విధితమే.

Related posts