ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే ఈ నిర్ణయంపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అశోక్గజపతిరాజు కూడా చంద్రబాబు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ పదవికి ఇప్పటికే సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించగా.. మరోవైపు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి సంబంధించిన వ్యవహారంలో స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అశోక్ గజపతిరాజు.. ఏడాదికిపై ఎన్నికలు కొనసాగుతుండటం దురదృష్టకరమైన విషయం అన్న ఆయన.. ఏకగ్రీవాలపై వ్యతిరేకత వచ్చింది.. అయినా.. ఎన్నికలు ఆగిన చోట నుంచే కొనసాగిస్తున్నారని విమర్శించారు. అయితే, ఈ ఎన్నికల్లో బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థులు పోటీ చేయడంపై స్థానిక కేడర్ అభిప్రాయాన్ని తీసుకోవాల్సింది అని.. కానీ, అది జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్న రాజకీయ పార్టీ అని.. నిజమైన కార్యకర్తలకు కొన్ని ఇబ్బందులు తప్పవు అన్నారు.
previous post