telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

వినాయక నిమజ్జనం రోజు ప్రజలు సహకరించాలి: తలసాని

talasani srinivasayadav on clp merger

హైదరాబాద్ ఖైరతాబాద్‌ గణేశ్‌ ఏర్పాట్లను సోమవారం తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు బందోబస్తు మధ్య వినాయక నిమజ్జనాన్ని నిర్వహిస్తామని అన్నారు. వినాయక నిమజ్జనం రోజు ప్రజలు సహకరించాలని కోరారు. 65వ సంవత్సరం జరుగుతున్న వినాయక ఉత్సవాలకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలి వస్తారు కనుక ట్రాఫిక్‌ మళ్లింపు చేపడతామన్నారు.

కరెంట్‌ ఇబ్బందులు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ చెప్పినట్టుగా రాష్ట్రంలో అన్ని మతాల పండుగలు అద్భుతంగా జరుగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్‌ వినాయకుడి దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. దర్శనం చేసుకునేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. హుస్సేన్‌సాగర్‌లో లోతైన ప్రాంతంలో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరుగుతుందన్నారు.

Related posts