telugu navyamedia
క్రీడలు వార్తలు

సన్ రైజర్స్ కోసం బయల్దేరి వస్తున్న వార్నర్…

ఐపీఎల్ 2021 కోసం భారత్‌కు వచ్చేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ సిద్దమయ్యాడు. దీనికి సంబంధించి ఓ ఫొటోను నిన్న సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఆ ఫొటోలో తన సతీమణి క్యాండిస్ వార్నర్‌తో కలిసి డేవిడ్ భాయ్ వైన్ తాగుతున్నాడు. ఈ ఫొటోకు తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చిన హైదరాబాద్ కెప్టెన్.. భారత్‌కు వచ్చే సమయం ఆసన్నమైందని, తన డార్లింగ్‌తో ఇదే చివరి పెగ్ అంటూ పేర్కొన్నాడు. ‘నా డార్లింగ్‌తో ఇదే నా చివరి పెగ్. అదృష్టవశాత్తు కొన్ని నెలలు కుటుంబంతో గడిపే సమయం దొరికింది. కానీ ఇప్పుడు బ్యాగ్‌లు సర్దుకొని భారత్‌కు వెళ్లే సమయం ఆసన్నమైంది. లవ్ యూ డార్లింగ్.. మిస్ యూ’అంటూ వార్నర్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అయింది. అయితే భారత్ తో జరిగిన సిరీస్ లో గాయపడిన వార్నర్ ఈ ఏడాది ఐపీఎల్ ఆడుతాడా… లేదా అని అనుకున్న సమయంలో రెండు రోజుల క్రితం ఐపీఎల్ 2021 సీజన్ కోసం భారత్‌కు వస్తున్నానని వార్నరే స్వయంగా వెల్లడించడంతో హైదరాబాద్ ఫ్యాన్స్ తెగ సంతోషపడ్డారు.

Related posts