telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : హైదరాబాద్ చేతిలో బెంగుళూరు పరాజయం…

ఐపీఎల్ 2020 లో ఈ రోజు రెండో మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో మొదట బ్యాటింగ్ కు వచ్చిన బెంగళూరు ను హైదరాబాద్ బౌలర్లు వణికించారు. ఈ జట్టు ఓపెనర్ జోష్ ఫిలిప్(31) తో రాణించడంతో నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. ఇక 121 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన సన్‌రైజర్స్ చేసింగ్ నెమ్మదిగా ప్రారంభించింది. అయిన వృద్దిమాన్ సాహా (31) పరుగులతో రాణించాడు. కానీ చివర్లో హోల్డర్ 10 బంతుల్లో 26 పరుగులతో రాణించడంతో హైదరాబాద్ 14.1 ఓవర్లలో విజయాన్ని సాధించింది. అయితే ఈ విజయంతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. హైదరాబాద్ రన్ రేట్ బాగుండటంతో తర్వాతి మ్యాచ్ లో ఈ జట్టు విజయం సాధిస్తే తప్పకుండ ప్లే ఆఫ్ లోకి వెళ్తుంది. ఈ పరాజయంతో బెంగుళూరు మొదటి రెండు స్థానాల్లో నిలిచే అవకాశాని కోల్పోయింది. తర్వాతి మ్యాచ్ లో ఢిల్లీ పై విజయం సాధిస్తే రెండో స్థానానికి వస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts