దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దు ప్రాంతాల్లోని చెక్పోస్టుల వద్ద నిఘా ఉంచి, వాహనదారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉన్నైట్లెతే.. వారిని తక్షణమే ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
కోటపల్లి మండలంలోని రాపనపల్లి గ్రామం సమీపంలో తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టును పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. అక్కడ నుంచి వచ్చి పోయే వాహనాలను పరిశీలించిన వాహనదారులకు వైద్యపరీక్షలకు నిర్వహించాలని సూచించారు.