telugu navyamedia
Uncategorized క్రైమ్ వార్తలు వార్తలు

అటవీ అధికారుల పై దాడి చేసిన తమిళ స్మగ్లర్లు…

అటవీ అధికారుల పై దాడి చేసారు స్మగ్లర్లు. శేషాచల అడవులలో అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. అయితే యర్రావారిపాళ్యం మండలం తలకోన ఆటవీప్రాంతంలోని ఉట్లదింపదడి, మర్రిమానుదడి ప్రాంతాలలో ఎర్రచందనం కోసం వచ్చిన 60 మంది తమిళ స్మగ్లర్లు కనిపించరు. అయితే స్మగ్లర్లు ఎక్కువ సంఖ్యలో ఉంది అటవీ శాఖ సిబ్బంది తక్కువగా ఉండడంతో అటవీ అధికారులపై ఆ తమిళ స్మగ్లర్లు రాళ్ళ తో దాడి చేసారు. దాంతో ఆత్మరక్షణకోసం అధికారులు రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. అయితే అధికారులు కాల్పులు జరపడంతో ఎర్రచందనం దుంగలను పడవేసి దట్టమైన అటవీ ప్రాంతంలోకి ఆ తమిళ స్మగ్లర్లు పారిపోయారు. ఇక ఆ తర్వాత వదిలేసిన 51 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు భాకరాపేట అటవీశాఖ అధికారులు. ఇక అదనపు బలగాలతో అధికారులు పారిపోయిన వారికోసం శేషాచల అడవులలో కుంబింగ్ నిర్వహిస్తున్నారు.

Related posts