telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఏపీలో సోషల్ మీడియా హెల్ప్ డెస్క్!

cell phone

కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ సర్కార్ పకడ్బంధీ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా కోవిడ్-19 విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రజలకు విస్తృత స్థాయిలో సమాచారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వాట్సాప్, ఫేస్ బుక్ సామాజిక మాధ్యమాల్లో కరోనా సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా ఇంటరాక్టివ్ హెల్ప్ డెస్క్ లను ప్రారంభించింది.

ఈ సహాయ కేంద్రాల ద్వారా కరోనా తాజా సమాచారంతో పాటు అప్ డేట్లను కూడా అందుకోవచ్చు. ఈ ఆన్ లైన్ సహాయ కేంద్రాల్లో ఓ చాట్ బోట్ ప్రజల సందేహాలకు బదులిస్తుంది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఫేస్ బుక్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపింది. స్వచ్ఛందంగా ముందుకొచ్చి చాట్ బోట్ కు రూపకల్పన చేసినందుకు ప్రశంసించింది.

Related posts