ఐపీఎల్ 2021లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ షాక్ తగిలింది. సన్రైజర్స్ స్టార్ పేసర్ టీ నటరాజన్.. ఐపీఎల్ 2021లోని మిగతా మ్యాచులకు దూరం కానున్నాడు. నటరాజన్ ఎడమ మోకాలికి అయిన గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతోనే టోర్నీ నుంచి అతడు తప్పుకోనున్నాడని సమాచారం. అయితే టీ నటరాజన్ గాయంపై సన్రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తాజాగా స్పదించాడు. ‘నటరాజన్ మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. క్వారంటైన్ రూల్ నిబంధనతో నట్టూ స్కానింగ్ చేసుకునే పరిస్థితి లేదు. స్కానింగ్ చేసుకోవాలంటే అతను బయో బబుల్ వీడాలి. ఒకవేళ బబుల్ వీడితే.. మళ్లీ వచ్చి ఏడు రోజుల క్వారంటైన్ పాటించాల్సి ఉంటుంది. ఫిజియోలు అతని గాయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. కానీ ఎదో ఒక టైమ్లో అతను స్కానింగ్ చేసుకోవాల్సిందే’ అని వార్నర్ చెప్పాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో టోర్నీ మొత్తానికి నట్టూ దూరం కానున్నాడు. యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020 సీజన్లో సన్రైజర్స్ తరపున 16 వికెట్లతో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకొని.. టీ నటరాజన్ అందరి ప్రశంసలు పొందాడు.
previous post
మోదీతో రాజీనామా చేయించాలని వాజ్పేయి భావించారు: యశ్వంత్ సిన్హా