telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఏపీ, తెలంగాణ ఆర్టీసీల మధ్య కుదిరిన ఒప్పందం

apsrtc tsrtc

ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ఆర్టీసీ సంస్థలకు ఆ సంస్థల అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఏపీకి తెలంగాణ నుంచి 826 ఆర్టీసీ బస్సులు తిరుగనుండగా తెలంగాణకు ఏపీ నుండి 638 బస్సులు తిరగనున్నాయి. విజయవాడ రూట్ లో 273 తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిరగానుండగా అదే రూట్ లో 192 ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. కిలో మీటర్ల చొప్పున బస్సు నడపాలని ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణ మంత్రి పువ్వాడ సమక్షంలో ఎంవోయూల మీద సంతకాలు చేసుకున్నారు. కర్నూల్ టు హైదరాబాద్ రూట్ లో 213 టిఎస్ఆర్టిసి బస్సులు తిరగనున్నాయి.

ఇక గుంటూరు హైదరాబాద్ వయా వాడపల్లి రూట్ లో టి ఎస్ ఆర్ టి సి 57 బస్సు తిప్పనుంది ఇక అదే రూట్ లో ఏపీఎస్ ఆర్టీసీ 88 బస్సులు తిప్పనుంది. మాచర్ల సెక్టార్లో టి ఎస్ ఆర్ టి సి 66 బస్సులు తిప్పనండగా ఏపీ బస్సులు 61 తిరగనున్నాయి. నూజివీడు, తిరువూరు, భద్రాచలం-విజయవాడ రూట్‌లో 48 టీఎస్ ఆర్టీసీ బస్సులు, 45 ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. ఖమ్మం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం రోడ్‌లో 35 టీఎస్ ఆర్టీసీ బస్సులు , 58 ఏపీ బస్సులు నడవనున్నాయి. అలానే హైదరాబాద్- శ్రీశైలం మార్గంలో టీఎస్ ఆర్టీసీ 62 బస్సులు తిప్పనుండగా శ్రీశైలం హైదరాబాద్ మార్గంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు. సత్తుపల్లి – ఏలూరు (12) రూట్లు టీఎస్‌ఆర్టీసీ 62, ఏపీఎస్‌ఆర్టీసీ 28 బస్సులు తిరగనున్నాయి. 

Related posts