సీఎం జగన్ విడుదల చేసింది ఉత్తుత్తి ఉద్యోగాల ‘డాబు క్యాలెండర్’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. 2.30లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన జగన్ .. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతను మోసం చేశారని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుని 54వేల ఉద్యోగాలు కొత్తగా ఇచ్చినట్టు మోసపు ప్రకటన ఇచ్చారని లోకేశ్ విమర్శించారు. వైసీపీ కార్యకర్తలకు వాలంటీర్లు, వార్డు, గ్రామ సచివాలయాల్లో పోస్టులు వేసుకుని ఉద్యోగాలు ఇచ్చినట్టు హడావుడి చేస్తున్నారని అన్నారు. దొంగ ఓట్లు వేయించే వైసీపీ కార్యకర్తల్ని వాలంటీర్లుగా నియమించటం వివక్ష లేకపోవడమా? వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగ భర్తీ పరీక్ష పేపరు అమ్మేయడం అవినీతికి తావులేకుండా భర్తీ చేసినట్టా అని లోకేశ్ ప్రశ్నించారు. ఉద్యోగాలు అమ్ముకోవడం మీ భాషలో అత్యంత పారదర్శకతా అని లోకేశ్ విమర్శించారు. ఏటా జనవరి 1న జాబు క్యాలెండర్ విడుదల చేస్తానని హామీ ఇచ్చి, రెండేళ్ల తరువాత తప్పుడు లెక్కలతో విడుదల చేసి, మడమ తిప్పడంలో తనకు ఎవరూ సాటిలేరని జగన్ నిరూపించుకున్నారని లోకేశ్ అన్నారు.
previous post
ముస్లింలకు బుద్ధి చెప్పాలంటే.. హిందువులు ముస్లిం మహిళలను రేప్ చేయాలి!: సునీతా సింగ్