సూపర్స్టార్ రజినీకాంత్ ఇటీవలే “దర్భార్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో రజినీకాంత్ భారీ హిట్ ను అందుకున్నారు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ స్పీడ్ చూసి యంగ్ హీరోలు షాక్ అవుతున్నారు. అయితే రజినీ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయనున్న సంగతి తెలిసిందే. ఈలోపు ఆయన తన కమిట్మెంట్స్ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు శివ దర్శకత్వంలో రజినీ కాంత్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రజినీకాంత్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినపడుతున్నాయి. సమాచారం మేరకు ‘ఖైదీ’ ఫేమ్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ సినిమా చేయబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ దర్శకుడు ప్రస్తుతం విజయ్తో ‘మాస్టర్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యే లోపు రజినీ, శివ చిత్రం పూర్తవుతుంది. తర్వాతే రజినీ, లోకేశ్ కనకరాజ్ కాంబోలో సినిమా తెరకెక్కనుందట. ఈ సినిమా విడుదల మాత్రం 2021లోనే ఉంటుందని టాక్.
previous post