సభలో ఎంపీల ప్రవర్తనకు నిరసనగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఈ రోజు ఉదయం నుంచి 24 గంటలు నిరాహార దీక్షకు దిగినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ బిల్లులపై జరిగిన చర్చలో విపక్ష ఎంపీలు సభలో అనుచితంగా ప్రవర్తించారని హరివంశ్ ఆరోపించారు.
రెండు రోజులుగా రాజ్యసభలో జరిగిన పరిణామాలు నన్ను మానసిక వేదనకు గురిచేశాయని తెలిపారు. ఈ అంశంపై ఆయన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు. సభలో కొందరు టేబుళ్లపై నిలబడి అసభ్య పదజాలం ఉపయోగించారు. జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుంటే నిద్రకూడా పట్టడం లేదుని లేఖలో పేర్కొన్నారు.
తన నిరాహార దీక్షతో సభ్యులు కొంతైనా పశ్చాతాపం చెందుతారని ఆశిస్తున్నానని అన్నారు. తాను జయప్రకాశ్ నారాయణ్ గ్రామానికి చెందిన వాడినని చెప్పారు. ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నారని వెల్లడించారు.
ఫెడరల్ ప్రంట్ పేరుతో కేసీఆర్ తీర్థయాత్రలు: పొన్నం