telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

తాడిపత్రి గొడవ పై ఇరువర్గాల వాదనలు ఇలా ఉన్నాయి…

ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎడ్ల బండ్లలో తరలించే ఇసుకకూ డబ్బులు వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. జేసీ ప్రభాకర్‌ రెడ్డి అనుచరులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ…నేరుగా జేసీ ఇంటికెళ్లారు పెద్దారెడ్డి. దాంతో జేసీ అనుచరులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయ్‌. రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు. వాహనాలకు నిప్పుపెట్టారు.  పోలీసులను లెక్కచేయలేదు. పరిస్థితి అదుపుతప్పడంతో  లాఠీఛార్జ్ చేశారు పోలీసులు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న  జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ నుంచి తాడిపత్రికి వెళ్లారు. అనుచరులను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాడి ఘటనపై కంప్లెయింట్ చేస్తే… కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. ఐతే తాను రిపోర్ట్‌ చేసేందుకు సిద్ధంగా లేనని జేసీ ప్రభాకర్ పోలీసుతో చెప్పారు. అలానే తాడిపత్రిలో దాదాగిరీ చేయాలన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన ఇంటికి వచ్చారని ఆరోపించారు… మాజీ ఎమ్మెల్యే JC ప్రభాకర్‌రెడ్డి. కానీ తనకు అలాంటి ఉద్దేశం లేదని కౌంటర్‌ ఇచ్చారు… పెద్దారెడ్డి. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల్ని బరిలో దింపకుండా భయపెట్టడానికే ఇదంతా చేస్తున్నారని జేసీ ఆరోపిస్తే… తాను అంత పిరికిపందను కాదని కౌంటర్‌ ఇచ్చారు… పెద్దారెడ్డి. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.

Related posts