అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్య అనంతరం నల్లజాతీయులు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అనేక ప్రాంతాల్లో నిరసనకారులు విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. విగ్రహాలను ధ్వంసం చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని చట్టం ప్రకారం శిక్షించాలని ఆయన తన ఆదేశాల్లో స్పష్టం చేశారు.
ఆందోళనకారులు ఆగడాలను నిలిపు చేయలేకపోతున్న పోలీసు శాఖలకు స్థానికంగా ఫెడరల్ ఫండ్స్ ఆపేయాలని కూడా ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాను కనుగొన్న క్రిస్టోఫర్ కొలంబస్తో పాటు అనేక మంది ప్రముఖ వ్యక్తుల విగ్రహాలను ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా నల్లజాతీయులు కూల్చివేస్తున్నారు. విగ్రహాలను కూలగొడుతున్న వారు వామపక్ష తీవ్రవాదులని ట్రంప్ వ్యాఖ్యానించారు.