పీసీసీ చీఫ్ ఎంపికపై రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్… అధిష్టానికి లేఖ ఇచ్చారు.. ఫైనల్గా ఐదుగురు నేతల పేర్లు లిస్ట్లో ఉండగా.. ఈ నెలాఖరులో కొత్త పీసీసీ చీఫ్పై అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు. అయితే, ఫైనల్ లిస్ట్లో తన పేరు లేదన్న లీక్పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి.. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ఆఫీసుకి మెసేజ్ మరియు మీడియా ద్వారా తన ఆవేదన తెలియజేశారు జగ్గారెడ్డి. పీసీసీ పదవిపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తానన్నారు జగ్గారెడ్డి.. కానీ, పార్టీలో ఉన్న నాయకులు చీలిపోకుండా నిర్ణయం జరగాలని ఆశిస్తున్నట్టు తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇక, సోనియా గాంధీకి పంపించిన లిస్ట్లో నాపేరు అధిష్టానం వద్ద చర్చకు లేకపోవడం దురదృష్టకరమైన విషయమన్న ఆయన.. 2017 సంవత్సరంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సంగారెడ్డిలో రాహుల్ గాంధీ కోసం భారీ బహిరంగ సభ కార్యక్రమం నాకు అప్పగించినప్పుడు.. ఆ కష్ట కాలంలో నేను కోట్ల రూపాయలు పెట్టి సభ నిర్వహించానన్నారు.. అయినా నాపేరు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు చర్చలో పోకవడం నాకు చాలా బాధ కలిగించిందన్నారు. ఈ రాష్ట్రానికి కొత్తగా వచ్చిన ఇంఛార్జ్ ఈ కార్యక్రమల గురించి తెలుసుకోకపోవడం, నాలాంటి ఆర్గనైజర్ పేరు ఢిల్లీ లిస్ట్లో పంపకపోవడం చాలా బాధకు గురిచేసిందని తెలిపారు.
previous post
next post