ఈ నెల 30న వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా విజయవాడలో ప్రమాణం చేయనున్న తరుణంలో శనివారం ఉదయం 10 గంటలకు వైసీపీ శాసనసభాపక్ష సమావేశం కానుంది. ఈ సమావేశంలో జగన్ను సభా నాయకునిగా లాంఛనంగా ఎన్నుకుంటారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయానికి కొత్తగా ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ కార్యాలయం ఆహ్వానించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా శాసనసభాపక్ష సమావేశం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, కేబినెట్ ప్రకటనకు అవసరమైన తేదీలను ఖరారు చేసింది. విజయవాడలో ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రివర్గాన్ని జగన్ ప్రకటించనున్నారు.