telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌ !

సీఎం కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ సంతకం చేశారు. విధి నిర్వహణలో భాగంగా పలు సందర్భాల్లో అనవసర వేధింపులకు గురవుతున్నామని, ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని గతంలో ఆర్టీసీ ఉద్యోగులు సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో ముఖ్యమంత్రి ఆర్టీసీ ఉద్యోగులకు వేధింపులు లేకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు అధికారుల కమిటీ మార్గదర్శకాలు రూపొందించింది. దీనికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.

Related posts