telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పథకానికి పేరు మార్చి వైసీపీ ప్రభుత్వం మాయ: చంద్రబాబు

tdp chandrababu

వైసీపీ ప్రభుత్వం వైఎస్సార్ కంటివెలుగు పథకాన్నిప్రారంభించిన నేయపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఇదేమీ కొత్త పథకం కాదని, టీడీపీ హయాం నుంచి అమలు చేస్తున్నదేనని వెల్లడించారు. తమ ప్రభుత్వ కాలంలో ఈ పథకం కింద 11 లక్షల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించామని చంద్రబాబు వివరించారు. ఇప్పుడు ఈ పథకానికి పేరు మార్చి వైసీపీ ప్రభుత్వం మాయ చేస్తోందని విమర్శించారు.

టీడీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 222 ఇ-ఐ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 67 లక్షల మందికి కంటి చికిత్స అందించామని తెలిపారు. 3 లక్షల మంది విద్యార్థులకు కూడా ఉచితంగా కళ్లద్దాలు ఇచ్చామని తెలిపారు. కనురెప్పల్ని సైతం మాయచేయగల వైసీపీ నేతలు ఇప్పుడు కంటివెలుగు పథకం అంటే ఏదో కొత్త పథకం అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

Related posts