telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ : పోలవరంలో మరో కీలక ఘట్టం పూర్తి

పోల‌వ‌రం ప్రాజెక్ట్ పనుల్లో మరో కీలక ఘట్టం పూర్తయింది. పోల‌వ‌రం స్పిల్ వే నుంచి ఈ వర్షాకాలంలో వరదనీరు మళ్ళించేందుకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎగువ కాఫ‌ర్ డ్యాం నిర్మాణం పూర్తి స్దాయిలో సిద్దం చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్ద… గోదావ‌రికి అడ్డుక‌ట్ట వేయ‌డం ఇంజ‌నీరింగ్ అద్భుతం అంటున్నారు నిపుణులు. గోదావరి నదీ ప్రవాహ మళ్ళింపు పనులు మొదలు కాగా.. గోదావరి నదీ ప్రవాహాన్ని ఎడమవైపు నుండి కుడివైపుకు మళ్ళిస్తున్నారు అధికారులు. అప్రోచ్ ఛానెల్ నుండి స్పిల్ వే మీదుగా స్పిల్ ఛానెల్ నుండి మరలా …ఫైలెట్ ఛానెల్ దగ్గర సహ‌జప్రవాహంలో కలువనుంది గోదావరి. ఎడమవైపు నుండి కుడివైపుకు దాదాపు 6.5 కి.మీ నదీ ప్రవాహాన్ని మళ్ళిస్తున్న అధికారులు… ఈ సీజన్ నుండే గోదావరి నీటిని స్పిల్ వే నుండి విడుదల చేయనున్నారు అధికారులు. ముందుగా రివర్ స్లూయిజ్ గేట్లను ఎత్తి గోదావరి నీటిని దిగువకు విడుదల చేయనున్న అధికారులు.. ఈ వర్షాకాలంలో వచ్చే వరద నీటిని స్పిల్ వే రేడియల్ గేట్లను…ఎత్తి ఉంచడం ద్వారా దిగువకు విడుదల చేయనున్నారు. ఇప్పటికే 14 రేడియల్ గేట్లను పైకి ఎత్తి సిద్దంగా ఉంచిన అధికారులు, మిగతా గేట్లను ఎత్తి ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఎగువ, దిగువ కాఫర్ డ్యాం నిర్మాణ పనులు స్పీడ్‌గా సాగుతున్నాయి.

Related posts