మన దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రలో ముఖ్యంగా ఏపీలో ఈరోజు 20 వేలకు పైగా కరోనా కేసులు వస్తున్నాయి. దాంతో ప్రస్తుతం అక్కడ నైట్ కర్ఫ్యూ, మధ్యాహ్నం నుంచి కర్ఫ్యూ అమలు జరుగుతున్నది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ప్రజలు బయట తిరిగేందుకు అవకాశం ఉన్నది. కర్ఫ్యూ విధించినప్పటికీ కేసులు కంట్రోల్ కావడం లేదని, తాత్సారం చేయకుండా ప్రభుత్వం వెంటనే పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నది. పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు చేస్తేనే ప్రజల ప్రాణాలు నిలబడతాయని, లేదంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని తెలుగుదేశం పార్టీ నేత అచ్చేన్నాయుడు పేర్కోన్నారు. నాయకులు ప్లకార్డులు చేతబూని నిరసనలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం ప్రజారోగ్యంపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షంపై కక్షసాధింపు సాధిస్తోందని అచ్చేన్నాయుడు పేర్కోన్నారు. చూడాలి మరి దీని పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారు అనేది.
previous post