telugu navyamedia
క్రీడలు వార్తలు

జరిగిన మ్యాచ్‌లకే డబ్బులు…

IPL

ఐపీఎల్‌ 2021 సీజన్‌ అర్దంతరంగా వాయిదాపడటంతో జరిగిన మ్యాచ్‌లకే డబ్బులు చెల్లించాలని స్పష్టం చేసింది స్టార్ స్పోర్ట్స్. 2018-2022 ఐదు సంవత్సరాలకు గాను స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానల్‌.. ఐపీఎల్‌ టెలివిజన్, డిజిటల్‌ ప్రసార హక్కులను రూ.16,348 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక్కో మ్యాచ్‌కు రూ.54.5 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మ్యాచ్‌లు జరిగేటప్పుడు విరామ సమయాల్లో ప్రకటనల కోసం స్టార్‌ ఇండియా.. పలు బ్రాండ్లు, స్పాన్సర్లకు టైమ్‌స్లాట్‌లను పెద్ద మొత్తంలో అమ్ముకుంది. ఇక ఈ సీజన్‌లో మొత్తం 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. ఇప్పటివరకు 29 మ్యాచ్‌లే జరిగాయి. ఇంకా 31 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. దాంతో ప్రకటనకర్తలు, స్పాన్సర్లు భారీ ఎత్తున నష్టపోయే ప్రమాదం వాటిల్లింది. ఈ నేపథ్యంలోనే స్పందించిన స్టార్‌ మేనేజ్‌మెంట్… ఆయా స్పాన్సర్లు, ప్రకటనకర్తలను ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల వరకే డబ్బు చెల్లింపులు జరపాలని కోరింది. మిగతావి తిరిగి మ్యాచ్‌లు నిర్వహించేటప్పుడు చెల్లించొచ్చని స్పష్టం చేసింది’ అని సంబంధిత అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

Related posts