telugu navyamedia
వార్తలు సామాజిక

నదిలో చిక్కుకున్న రైలు..ప్రయాణీకులు సురక్షితం

train flood

మహారాష్ట్రలోని ఉల్లాస్ నది ఉప్పొంగడంతో బద్లాపూర్ – వింగనీ మధ్య ఉన్న నదిలో మహాలక్ష్మీ ఎక్స్ ప్రెస్ రైలు చిక్కుకుంది. రైలులోని 1,050 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని వారందరినీ వాళ్ళ గమ్యస్థానానికి వెళ్లే ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. నిన్న ఈ రైలు వరద నీటిలో చిక్కుకుపోగా, ప్రయాణికులంతా గంటల పాటు భయందోళనలో గడిపారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లలు తినేందుకు ఆహారం, నీరు లేక, బయటకు దిగే వీలు లేక తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

రైల్వేశాఖతో పాటు ఎన్డీఆర్ఎఫ్, వాయుసేన రంగంలోకి దిగి, హెలికాప్టర్లు, ప్రత్యేక బోట్లతో రైలు వద్దకు చేరుకొని ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి చేర్చారు. ఆపై వీరందరినీ కల్యాణ్ కు సురక్షితంగా తరలించామని, వారి కోసం కొల్హాపూర్‌ వరకూ ప్రత్యేక రైల్ ను నడిపించామని అధికారులు అన్నారు. పుణెలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు  ప్రాంతాల్లో వరద నీరు ఉప్పొంగుతుంది. 

Related posts