మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలకమైన ఆధారాలను సేకరించినట్టుగా కడప ఎస్పీ రాహుల్ ప్రకటించారు.గురువారం అర్ధరాత్రి వివేకానందరెడ్డి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. శుక్రవారం రిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించారు.వివేకానందరెడ్డిది హత్యేనని పోస్ట్మార్టం ప్రాథమిక నివేదికలో వైద్యులు నిర్ధారించారు. తలపై, చేతిపై రెండు చోట్ల గాయాలున్నట్టుగా గుర్తించామన్నారు.
ఫింగర్ ఫ్రింట్స్ కూడ సేకరించామని ఎస్పీ వివరించారు.
రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటలలోపు ఏం జరిగిందనే విషయమై ఆరా తీస్తున్నామని ఎస్పీ వివరించారు. హత్యకు సంబంధించిన విషయమై శాస్త్రీయమైన ఆధారాలను సేకరించేందుకు ఫోరెన్సిక్ బృందాలను రప్పిస్తున్నామని తెలిపారు. అనంతరం పులివెందులలోని ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించారు. వివేకా నివాసం వద్ద భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో వివేకా మృతి దర్యాప్తు కోసం సిట్ ను ఏర్పాటు చేశారు.