telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీకి కీడు చేసేలా జగన్ విధానాలు: కాల్వ శ్రీనివాసులు

Tdp Kalva Srinivasulu

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. ప్రచారం పిచ్చితో జగన్ రాయలసీమకు తీరని ద్రోహం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అపెక్స్ కౌన్సిల్ లో ఏపీకి కీడు చేసేలా జగన్ విధానాలు ఉన్నాయని విమర్శించారు. రాయలసీమకు చేటు తెచ్చేలా ఉన్నాయని దుయ్యబట్టారు.

గత 70 ఏళ్ల కాలంలో ఎన్నడూ రాని పరిశ్రమలు చంద్రబాబు హయాంలో అనంతపురం జిల్లాకు వచ్చాయని చెప్పారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు రావడంతోనే కియా కార్ల పరిశ్రమ వచ్చిందని తెలిపారు. కర్నూలు జిల్లాలో సిమెంట్ పరిశ్రమలు, మెగా సోలార్ పార్క్, భారీ విత్తన ఉత్పత్తి కేంద్రం వచ్చాయని చెప్పారు. రూ. 590 కోట్లతో ముచ్చుమర్రి ప్రాజెక్టును టీడీపీ హయాంలో నిర్మించామని దీని వల్ల కర్నూలు జిల్లాకు నీటి కొరత తీరిందని అన్నారు.

Related posts