భారత్ మొత్తం ఐదు స్వర్ణాలను దక్కించుకుని మరోసారి షూటింగ్ ప్రపంచ కప్లో తన సత్తా చాటింది. ఈ టోర్నీలో భారత్ 5 స్వర్ణాలు, రెండు రజితం, 2 కాంస్యం పతకాలు సొంతం చేసుకుంది. అపూర్వ చండేలా-దిపక్కుమార్ జోడీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ విభాగంలో చైనాకు చెందిన జోడిని ఓడించి స్వర్ణ పతకం గెలుచుకుంది.
10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో మనుబాకర్- సౌరభ్ చౌదరీ జోడీ భారత్కే చెందిన యశస్వినీ దేశ్వాయ్ – అభిషేక్ వర్మ జోడీని ఓడించి స్వర్ణం గెలుచుకున్నారు. దీంతో యశస్వినీ దేశ్వాయ్ – అభిషేక్ వర్మ జోడీకి రజితం లభించింది. భారత్కు చెందిన మరో జోడి అంజుమ్ మౌడ్గిల్-దివ్యాన్ష్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ విభాగంలో హంగేరియన్ జోడిని ఓడించి కాంస్య పతకం సొంతం చేసుకుంది.