ఏపీలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో రోజు రోజుకి కొత్తగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కోవిడ్ భారీనపడుతున్నారు.
తాజాగా మరో మ్మెల్యేకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాకి చెందిన కొత్త పేట వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని వైద్యులు ధ్రువీకరించారు
ప్రస్తుతం ఎమ్మెల్యేకి కరోనా లక్షణాలు పెద్దగా లేకపోవడంతో హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇక గత వారం రోజులుగా ఆయనతో సన్నిహితంగా ఉన్న నేతలు, కార్యకర్తలు కూడా హోమ్ క్వారంటైన్లో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,548 పాజిటివ్ కేసులునమోదైనాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,14,164కి చేరింది.