దేశ రాజధాని ఢిల్లీలో నేవీ రిటైర్డ్ అధికారి దారుణ హత్యకు గురయ్యారు. అతి సమీపం నుంచి ఆయనపై కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. నేవీ రిటైర్డ్ అధికారి బలరాజ్ దేశ్వాల్ (55) తన వ్యాపార భాగస్వాములతో కలిసి ద్వారకలోని సెక్టార్ 12లో ఓ అపార్ట్మెంట్ నిర్మించారు.
ప్రదీప్ ఖోకర్ అనే వ్యక్తి అందులో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ఈ ఫ్లాట్కు సంబంధించి అతను ఇంకా రూ. 5 లక్షలు చెల్లించాల్సి ఉంది.ఈ విషయంలో నిన్న అపార్ట్మెంట్ కార్ పార్కింగ్ ప్రదేశంలో బలరాజ్, ప్రదీప్ల మధ్య వాగ్వివాదం జరిగింది.
ఈ క్రమంలో ఆగ్రహంతో ప్రదీప్ ఒక్కసారిగా తుపాకితో బలరాజ్పై కాల్పులు జరిపాడు. ఓ తూటా ఆయన నోట్లోంచి దూసుకుపోయింది. దీంతో కుప్పకూలిన ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
చంద్రబాబు కావాలనే రెచ్చగొడుతున్నాడు: మంత్రి అవంతి