టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఎప్పుడూ సోషల్ మీడియాలో అప్డేట్ గా ఉంటారు. అంతేకాదు తన భర్త ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. చరణ్ అంత ఫిట్ గా ఉండడానికి ఏమేం డైట్ ఫాలో అవుతున్నాడో టైమ్ తో సహా అభిమానులతో పంచుకున్నారు ఉపాసన. తాజాగా చరణ్ కోసం ఉపాసన చేసిన చేపల ఫ్రైకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వినయ విధేయ రామ సినిమా లొకేషన్లో చెర్రీ కోసం ఫిష్ ఫ్రై చేసి అదరగొట్టింది. అదీ గ్రిల్డ్ చేప ఫ్రైతో చెర్రీ నో కొలెస్ట్రాల్ ఫుడ్ అందించింది. “వినయ విధేయ రామ” షూటింగ్ లొకేషన్ పక్కనున్న కాలువ నుంచి పట్టుకొచ్చిన చేపను ఉప్పు వాడకుండా… ఆలివ్ ఆయిల్, నిమ్మరసంతో ఫ్రై చేశారు ఉపాసన. ఆ తర్వాత చేపకు తోడుగా బంగాళాదుంప, అల్లంను ఆమె జత చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
on set #vvr – We cook while he shoots.
Strict diet+freezing weather = amazing shots 👍🏻😉
Used potato instead of sweet potato cos it was hard to find & Mr.C needed the energy as it was an intense action sequence. Make eating healthy fun 😊#ramcharan #ThrowbackThursday pic.twitter.com/2260GjTAvZ— Upasana Konidela (@upasanakonidela) January 3, 2019