telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అలా చేస్తే స్టీల్‌ ప్లాంట్‌ లాభాల్లో దూసుకుపోతుంది : విజయసాయిరెడ్డి సలహా

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమని విజయసాయిరెడ్డి అన్నారు. ఎలాంటి పోరాటానికి అయిన తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. స్టీల్ ప్లాంట్ పై టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను నష్టాల్లో చూపించే ప్రయత్నం కేంద్రం చేస్తోందని…రుణాలను బ్యాంకులో ఈక్విటిగా మార్చితే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేసుకోవచ్చని.. దానివల్ల ప్రజలే కొనుక్కునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రయివేట్ పరం చేయకుండా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేయాలని.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం చేయూత ఇస్తే నష్టాల బాట నుండి లాభల్లోకి తీసుకురావొచ్చని తెలిపారు. సొంత గనులు కేటాయించి రుణబారాన్ని ఇక్వీటిలుగా కన్వర్ట్ చేయాలని.. ఫిబ్రవరి 6న స్టీల్ ప్లాంట్ కోసం ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ రాసారని గుర్తు చేశారు. 2002 నుండి 2015 వరకు విశాఖ ఉక్కు లాభాలు తెచ్చిపెట్టిందని.. 19,700 ఎకరాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ లక్ష కోట్లకు పైగా విలువ చేస్తుందన్నారు. 2014 నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలు బాటలో నడుస్తుందని..సొంత గనులు కేటాయించడం వల్ల నష్టాల నుండి లాభాల బాట పడుతుందన్నారు. నూటికి నూరు శాతం NMDC నుండి ముడిసరుకు తీసుకుంటుందని పేర్కొన్నారు.

Related posts