ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై బీహార్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ సోకి మరణించిన వారికి 4 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించింది. ఆ డబ్బును బాధిత కుటుంబసభ్యులకు అందజేయనున్నట్లు సీఎం నితీశ్ కుమార్ ఈ రోజు అసెంబ్లీలో తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆ సొమ్మును చెల్లించనున్నారు.
కరోనా చికిత్స కోసం అయ్యే మొత్తం ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇండో నేపాల్ బోర్దర్లో మొత్తం 49 చోట్ల ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో బీహార్ అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు.