telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

క‌రోనాతో మరణిస్తే.. 4 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం: సీఎం నితీశ్ కుమార్

CM Nitish Kumar

ప్రపంచాన్ని వణికిస్తున్న క‌రోనా వైర‌స్ పై బీహార్ రాష్ట్ర ప్ర‌భుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ సోకి మ‌ర‌ణించిన వారికి 4 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారాన్ని ప్రకటించింది. ఆ డ‌బ్బును బాధిత కుటుంబ‌స‌భ్యుల‌కు అందజేయనున్నట్లు సీఎం నితీశ్ కుమార్ ఈ రోజు అసెంబ్లీలో తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆ సొమ్మును చెల్లించనున్నారు.

క‌రోనా చికిత్స కోసం అయ్యే మొత్తం ఖ‌ర్చుల‌ను ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌న్నారు. ఇండో నేపాల్ బోర్ద‌ర్‌లో మొత్తం 49 చోట్ల ప్ర‌యాణికుల‌కు స్క్రీనింగ్ నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో బీహార్ అసెంబ్లీని నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు.

Related posts