మంగళవారం కురిసిన అకాల వర్షానికి తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజకవర్గంలోని శ్రీరాములపల్లి, మల్యాల మండలం మ్యాడంపల్లి గ్రామాల్లో మామిడి తోటలను సందర్శించి రైతులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యం కారణంగా అకాల వర్షాలు, వడగండ్ల వాన పడటంతో మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిని తీవ్ర నష్టం జరగడం బాధాకరమని అన్నారు. దెబ్బతిన్న మామిడి తోటలపై నివేదిక తయారు చేయాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అధైర్య పడకండి అండగా ఉంటామాని రైతులకు భరోసా కల్పించారు.