telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వెన్నుపోటు పొడిచాక..ఎన్టీఆర్ ఫోటో తీసేశాడు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై మరోసారి సెటైర్ వేశారు. “వెన్నుపోటు పొడిచాక నాలుగేళ్లపాటు పార్టీ ఆఫీసుల్లో కూడా ఎన్టీఆర్ ఫోటో కనిపించకుండా చేశాడు చంద్రబాబు. ఎన్టీఆర్ మానసిక వ్యాధితో మరణించేంత వరకు మహానాడుల్లో కూడా ఆయన పేరు వినిపించకుండా జాగ్రత్త పడ్డాడు. 2004 ఎన్నికల సమయంలో ఆయన పేరును వాడుకున్నా ఓడిపోయాడు. గడియారం ముల్లుపై ఆశలు పెట్టుకుని జూమ్ లో కాలక్షేపం చేస్తుండు. శాశ్వతంగా అక్కడే మిగిలిపోతావు. కాలం పరుగులు పెడుతూనే ఉంటుంది. దానితో పోటీపడి పని చేస్తుంటాడు యువ సిఎం. నీకు వయసు మీద పడింది. టైమ్ అయిపోయింది. ముల్లు వెనక్కి తిరగదు.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక అంతకు ముందు ట్వీట్ లో నారా లోకేష్ పై ఫైర్ అయ్యారు. “తండ్రి కంటే కొడుకు ఒక ఆకు ఎక్కువే చదివాడని కిరీటం పెట్టించుకోవాలని తెగ ఆరాటపడుతున్నాడు మాలోకం. కరోనా నేపథ్యంలో టెన్త్ పరీక్షలను వాయిదా వేస్తే అది తన ఘనతే అని జబ్బలు చరుచుకుంటున్నాడు. చదువు ‘కొన్న’ వాడికి పరీక్షల విలువ ఏం తెలుస్తుంది? శుద్ధ మొద్దులకే పరీక్షలంటే భయం.” అంటూ విజయసాయిరెడ్డి వెల్లడించారు.

Related posts