telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా నుంచి కోలుకున్న ధృవ్ సర్జా దంపతులు

Dhruv-sarja

రోజురోజుకు ఇండస్ట్రీలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇటీవల కన్నడ స్టార్ హీరో ధృవ్ సర్జాకు ఆయన సతీమణి ప్రేరణ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ధృవ్ సర్జా, ఆయన సతీమణి ప్రేరణ కరోనాను జయించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కోవిడ్ పరీక్షల్లో ఇద్దరికి నెగిటివ్ వచ్చినట్లు తెలిపాడు ధృవ్. కష్టసమయంలో మద్దతుగా నిలిచిన కుటుంబం సహా అభిమానులకు కృతజ్ఞతలు చెప్పుకొచ్చాడు. అంతేకాదు వారిద్దరికీ వైద్యం చేసిన డాక్టర్.సుర్జిత్ పాల్ సింగ్, అతడి వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపాడు. కాగా ప్రముఖ హీరో అర్జున్ సర్జా మేనల్లుడే ధృవ్ సర్జా. కాగా ఇటీవల అర్జున్ కుమార్తె, నటి ఐశ్వర్య అర్జున్ కూడా కరోనా బారిన పడ్డారు. ఐశ్వర్య ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.

Related posts