‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్ తదుపరి సినిమా ‘సాహో’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, శ్రద్ధాకపూర్ హీరోయిన్గా సుజిత్ దర్శకత్వం లో యువి క్రియెషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డిలు నిర్మాతలుగా నిర్మించిన “సాహో” గత ఏడాది అగష్టు లో విడుదలయ్యింది. అయితే సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. వెండితెరపై ఆకట్టుకోలేకపోయిన ‘సాహో’ బుల్లితెరపై మాత్రం రికార్డును క్రియేట్ చేస్తోంది. ‘సాహో’ సినిమా హిందీ వెర్షన్ను ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం చేశారు. దీనికి సంబంధించిన రేటింగ్స్ విడుదలయ్యాయి. మొత్తంగా ఈ సినిమా 8 మిలియన్ పైగా వ్యూస్ను రాబట్టుకుంది. 2020లో 17వ వారంలో ఎక్కువమంది చూసిన సినిమాగా ‘సాహో’ రికార్డ్ క్రియేట్ చేసింది.
previous post