తెలంగాణలో కరోనా నిర్ధారణ పరీక్షలు తక్కువగా చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. ‘కరోనా పరీక్షలు ఎక్కువ సంఖ్యలో ఎందుకు చేయడంలేదని తెలంగాణ ప్రభుత్వానికిహైకోర్టు మొట్టికాయలు వేసింది. తక్కువ పరీక్షలు చేయడం, తక్కువ కేసులు చూపెట్టడం ప్రజలను ఫూల్స్ చేయడమేనని కోర్టు చెప్పింది. ప్రభుతం ఇప్పుడైనా మేల్కొనాలి. కరోనా పరీక్షలు ఎక్కువ సంఖ్యలో చేయాలి’ అని ఉత్తమ్ కుమార్రెడ్డి ట్వీట్ చేశారు.
కరోనా పరీక్షలను తగినంత మేరకు ఎందుకు జరపడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించిందంటూ వచ్చిన వార్తను ఆయన పోస్ట్ చేశారు. కరోనా లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేస్తామని చెప్పడం సరైన విధానమేనా? అని కోర్ట్ నిలదీసిన వార్త పత్రికల్లో ఉన్నాయని ఉత్తమ్ పేర్కొన్నారు.