telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ సేతుపతి మంచి మనసుకు ఫిదా అయిన రైతులు

Vijay-Sethupathi

విజయ్‌ సేతుపతి, శ్రుతిహాసన్‌ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం “లాభం”. రాజకీయ నేపథ్యంతో కూడిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో తెలుగు సీనియర్‌ నటుడు జగపతిబాబు విలన్‌గా, కలై అరసన్‌, పృథ్వి తదితదిరులు సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. డి.ఇమాన్‌ సంగీతం, రామ్‌జీ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ప్రస్తుతం తుది షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతోంది. విజయ్‌సేతుపతి సొంత బ్యానర్‌, 7సీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై సంయుక్తంగా ‘లాభం’ను నిర్మిస్తున్నారు. సీరియస్‌ కథలతో సమాజానికి సందేశాన్నిచ్చే సినిమాలు తీస్తారన్న పేరు దక్కించుకున్న సీనియర్‌ దర్శకుడు జననాథన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ నిమిత్తం రైతు సంఘ భవనం అవసరమైంది. చిత్ర బృందం సెట్‌వేసి షూటింగ్‌ చేద్దామని సన్నాహాలు చేస్తుండగా.. సెట్‌ వద్దు, యదార్ధమైన లొకేషన్‌లోనే చిత్రీకరణ జరుపుదామని విజయ్‌ సేతుపతి చెప్పారు. అంతేకాదు, నిజంగానే రైతు సంఘం కోసం ఒక భవనం నిర్మించి, షూటింగ్‌ పూర్తయ్యాక ఆ ఊరి ప్రజలకే ఆ భవనాన్ని అప్పగించాలని చెప్పారట. దీంతో “లాభం” సినిమాతో తమ ఊరికి లాభం చేకూరుతోందని ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ “నా చిత్రానికి లాభం అనే టైటిల్‌ పెట్టడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందులో ఎవరికి లాభం అనేది, ఏం లాభం అనే విషయాల్ని చూపించబోతున్నాం. దేశంలోని అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ రైతులు పండించేవే. అయితే ప్రస్తుతం రైతులు కష్టపడుతున్నారు. రైతు సమస్యలు ఏ గ్రామానికో, రాష్ట్రానికో పరిమితం కాదు. ఇది అంతర్జాతీయ సమస్య. ఆ విషయాన్నే ఈ చిత్రంలో చూపించబోతున్నాం” అని చెప్పారు.

Related posts