దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తాజాగా ఓ కొత్త సినిమాని తెరకెక్కించే పనిలో పడ్డారు. సుదీర్ఘ విరామం తర్వాత కే రాఘవేంద్రరావు తన కొత్త చిత్రాన్ని ప్రకటించబోతున్నారు. ఈ విషయాన్ని అయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “అక్టోబర్ 9 (రేపు) ఉదయం 11:30 గంటలకు కొత్త ప్రాజెక్టును ప్రకటించనున్నట్టు వీడియో ద్వారా తెలియజేశారు. ఆహ్వానం.. విందు వినోదం.. నిర్మాణ సంస్థ నుంచి రేపు ఉదయం 11.30 గంటలకు వార్త రాబోతుంది” అని ఆ వీడియోలో పేర్కొన్నారు రాఘవేంద్రరావు. అయితే తాజా సమాచారం ప్రకారం రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని కొత్త తారాగణంతో తెరకెక్కిస్తున్నట్టుగా, ఈ సినిమాకి ఆయనే నిర్మాత అని తెలుస్తోంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా కీరవాణి చేయనున్నారు. ప్యూర్ లవ్ సబ్జెక్ట్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. మిగతా వివరాలు తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే. ఆయన చివరిగా అక్కినేని నాగార్జున హీరోగా ఓం నమో వెంకటేశాయ అనే భక్తీరస చిత్రాన్ని తెరకెక్కించారు.
దాసరి ఆస్తి వివాదంపై మోహన్ బాబు వివాదం