telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎం.ఎస్.ధోనీ నటుడు ఆత్మహత్య..

గతేడాది ఎంఎస్‌ ధోని సినిమా హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటన తర్వాత చాలా మంది నటులను బాలీవుడ్‌ కోల్పోయింది. ఇప్పటికే పలుగురు నటులను కోల్పోయిన బాలీవుడు..తాజాగా మరోసారి శోకసంద్రంలోకి వెళ్లిపోయింది. ముంబైకి చెందిన బాలీవుడ్‌ నటుడు సందీప్‌ నహర్‌ (32) ఆత్మహత్య చేసుకున్నాడు. అక్షయ్‌ కుమార్‌ కేసరి, ఎంఎస్‌ ధోనీ బయోపిక్‌ల్లో సహాయ పాత్రలు పోషించిన సందీప్‌ సోమవారం సాయంత్రం ఫేస్‌బుక్‌లో సూసైడ్‌ నోట్‌ పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే ఉరేసుకున్నాడు. తన భార్య కాంచన్‌, అత్త రెండేళ్లుగా తీవ్ర వేధింపులు, బెదిరింపులకు గురి చేస్తున్నారని సూసైడ్‌ నోట్‌లో ఆరోపించాడు. భార్యతో తనకు కొంతకాలంగా తీవ్ర విభేదాలు కొనసాగుతున్నట్లు తెలిపాడు నహర్‌. తన మృతికి ఎవరూ బాధ్యులు కారని స్పష్టం చేశాడు. ఆత్మహత్యే సమస్యలకు పరిష్కారమని భావిస్తున్నట్లు తెలిపాడు. ఉరేసుకున్న అనంతరం గమనించిన కుటుంబ సభ్యులు నహర్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే నహర్‌ మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

Related posts