ఒకప్పుడు మూడు రాష్ట్రాల పోలీసు అధికారులను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్య బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. క్రిష్ణగిరిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మంటపంలోనిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె తన అనుచరులతో కలిసి బీజేపీ క్నడువా కప్పుకున్నారు.
తమిళనాడు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రన్, పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి మురళీధరన్, మాజీ కేంద్ర మంత్రి పొన్ రాధాక్రిష్ణన్ తదితరుల సమక్షంలో బీజేపీలో చేరారు. విద్యతో పాటు ఆమె మిత్రులు, అనుచరులు సుమారు 2 వేల మంది బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా విద్య మాట్లాడుతూ, ప్రజా సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను బీజేపీలో చేరినట్టు వెల్లడించారు.
బాబు అప్పుడు హైదరాబాద్ వదిలివచ్చారు..ఇప్పుడు అక్కడికే పారిపోయారు!