వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో తమకు ఏ సమస్యా లేదని, ఈసీ వైఖరిపైనే తమ అభ్యంతరమని అన్నారు. ఏపీ మంత్రి వర్గ సమావేశం ముగిసిన అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, అధికారులతో తమకు ఎలాంటి సమస్యా లేదని, వారి సహకారం వల్లే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించామని అన్నారు.
ఎన్నికల కోడ్ ను అడ్డంపెట్టుకుని ఇబ్బంది పెట్టాలని చూశారని, ‘కోడ్’ అమలులో ఉన్నప్పుడు కొత్త విధాన నిర్ణయాలు మాత్రమే తీసుకోకూడదని అన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు స్పందించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ‘ఫణి’ తుపాన్ వల్ల ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని, బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు.