telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

వేణు మరణం ఇండస్ట్రీకి తీరని లోటు: చిరంజీవి

chiranjeevi on cine musical night

ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ మృతి పట్ల మెగాస్టార్‌చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబస‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ‘మాస్టర్’ సినిమాలో వేణుమాధవ్ తనతో తొలిసారి నటించారని ఈ సందర్భంగా చిరంజీవి చెప్పారు. హాస్య నటుడిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారని కితాబిచ్చారు.

వేణుమాధవ్ మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. వేణు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. మరోవైపు సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రి నుంచి వేణుమాధవ్ భౌతికకాయాన్ని మౌలాలిలోని ఆయన నివాసానికి తరలించారు. ఆయన పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం రేపు ఫిలిం ఛాంబర్ కు తరలించనున్నారు.

Related posts